ఇండియా టాప్‌‌‌‌‌‌‌‌ షూటర్‌‌‌‌‌‌‌‌ సిఫ్ట్‌‌‌‌‌‌‌‌ కౌర్‌‌‌‌‌‌‌‌కు బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌

ఇండియా టాప్‌‌‌‌‌‌‌‌ షూటర్‌‌‌‌‌‌‌‌ సిఫ్ట్‌‌‌‌‌‌‌‌ కౌర్‌‌‌‌‌‌‌‌కు బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌

మ్యూనిక్‌‌‌‌‌‌‌‌ : ఇండియా టాప్‌‌‌‌‌‌‌‌ షూటర్‌‌‌‌‌‌‌‌ సిఫ్ట్‌‌‌‌‌‌‌‌ కౌర్‌‌‌‌‌‌‌‌ సమ్రా.. ఐఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో కాంస్య పతకంతో మెరిసింది. గురువారం జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌ 50 మీటర్ల రైఫిల్‌‌‌‌‌‌‌‌ త్రీ పొజిషన్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో కౌర్‌‌‌‌‌‌‌‌ 453.1 పాయింట్లతో మూడో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలిచింది. నార్వేకు చెందిన జీనెట్‌‌‌‌‌‌‌‌ హెగ్‌‌‌‌‌‌‌‌ డ్యూస్టాడ్‌‌‌‌‌‌‌‌ (466.9), స్విట్జర్లాండ్‌‌‌‌‌‌‌‌ షూటర్‌‌‌‌‌‌‌‌ ఎమెలీ జాగీ (464.8) స్వర్ణం, రజతం నెగ్గారు. క్వాలిఫికేషన్​లో ఎమెలీ 590 పాయింట్లతో తొమ్మిదో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలిచింది.

కానీ ఇద్దరు షూటర్లు కేవలం ర్యాంకింగ్‌‌‌‌‌‌‌‌ పాయింట్ల కోసమే క్వాలిఫికేషన్​లో పాల్గొనడంతో ఎమెలీకి ఫైనల్‌‌‌‌‌‌‌‌ ఆడే చాన్స్‌‌‌‌‌‌‌‌ వచ్చింది. ఇక క్వాలిఫికేషన్‌‌‌‌‌‌‌‌లో సిఫ్ట్‌‌‌‌‌‌‌‌ 592 పాయింట్లతో రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలిచింది. ఆషి చౌక్సీ (589), అంజుమ్‌‌‌‌‌‌‌‌ మౌద్గిల్‌‌‌‌‌‌‌‌ (586), శ్రీయాంక సదాంకీ (582), నిశ్చల్‌‌‌‌‌‌‌‌.. వరుసగా 11, 27, 53, 60వ స్థానాలు సాధించారు.